హైదరాబాద్ : గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ శివశక్తి నిషా క్రాంతి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిషా క్రాంతి మాట్లాడుతూ ఆషాడ మాసం సందర్భంగా.. అమ్మవారికి ఇష్టమైన వేప మొక్కను నాటానని, ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.
ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్కి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని తెలిపారు.