FSL Fire Accident | హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయన్న ప్రచారంపై ఆ సంస్థ డైరెక్టర్ శిఖా గోయెల్ స్పందించారు. ఫైర్ యాక్సిడెంట్లో రెండు కీలక కేసుల్లోని ఆధారాలు కాలిపోయినట్లుగా దుష్ప్రచారం జరుగుతోందని.. ఆయా కేసులకు సంబంధించిన సామగ్రిని గతంలోనే కోర్టుకు అప్పగించామని తెలిపారు. 2015 నాటి ఏసీబీ కేసు విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
శనివారం ఉదయం 10.08 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని.. ఫైర్ సిబ్బంది 1.30 గంటలకు మంటలు ఆర్పివేశారని తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్, ట్రైనింగ్హాలుతో పాటు లైబ్రరీ, హెచ్ఆర్డీ రూమ్కు మంటలు వ్యాపించాయని పేర్కొన్నారు. ఎఫ్ఎస్ఎల్లో అగ్నిప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని శిఖా గోయెల్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై వారు దర్యాప్తు చేపట్టారని పేర్కొన్నారు. జరిగిన నష్టంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారని.. దీనిపై స్పష్టత వచ్చాక వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని శిఖా గోయెల్ తెలిపారు. రెండు కీలక కేసుల్లోని ఆధారాలు కాలిపోయినట్లు దుష్ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. ఆయా కేసులకు సంబంధించిన సామగ్రిని గతంలోనే కోర్టుకు అప్పగించామని చెప్పారు. 2015 నాటి ఏసీబీ కేసు విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పంజాగుట్ట పీఎస్లో నమోదైన కేసులోనూ ఆధారాలు కోర్టుకు సమర్పించామని.. 2024 వరకు సేకరించిన 16 ఆధారాల్లో 7 మినహా మిగతావన్నీ న్యాయస్థానానికి ఇచ్చేశామన్నారు. అన్ని ఆధారాలు, పరికరాలను ఎఫ్ఎస్ఎల్ సురక్షితంగా ఉంచుతుందని తెలిపారు. ఏదైనా జరిగితే మా టీమ్ సమాచారాన్ని పునరుద్ధరిస్తుందని వివరించారు.
2015 కేసు అంటున్నారు కానీ ఓటుకు నోటు కేసు పేరు చెప్పడానికి అంత భయం ఎందుకు? pic.twitter.com/CKbb2MwBdo
— Telugu Scribe (@TeluguScribe) February 8, 2026