పట్టుబడిన 44 మంది
సిటీబ్యూరో, జూన్ 18(నమస్తే తెలంగాణ): పోకిరీల భరతంపట్టాయి రాచకొండ షీటీమ్స్. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి.. నాలుగు వారాల్లో మొత్తం 44 మందిని పట్టుకున్నారు. అందులో 40 మందిపై కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్-13, పెట్టీ కేసులు-19, కౌన్సెలింగ్ కేసులు-8 నమోదు చేశారు. దొరికిన వారిలో 25 మంది మేజర్లు, 19 మంది మైనర్లు ఉన్నారు. అదే విధంగా రాచకొండ షీ టీమ్స్ మేలో 3 బాల్య వివాహాలను ఆపింది.
ఇన్స్టాగ్రామ్లో బాలికను మాయ చేసి ఆమెను ప్రేమ వివాహం చేసుకుంటానని నమ్మించి.. లైంగిక దాడికి పాల్పడిన రవిశ్రవణ్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. బస్సు ఓ కండక్టర్ ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించగా, ఆమె వాట్సాప్లో ఫిర్యాదు చేయడంతో షీ టీమ్స్.. కండక్టర్ను రిమాండ్కు పంపింది. బాధితులు ఎవరైనా రాచకొండ వాట్సాప్ 9490617111 లేదా డయల్ 100కు, సోషల్ మీడియా వేదికల నుంచి రాచకొండ షీ టీమ్స్కు ఫిర్యాదు చేయొచ్చని అధికారులు సూచించారు.