అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా సీలేరు నదిలో నాటు పడవలు బోల్తాపడి గల్లంతైన వారిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. చీకటి పడటంతో సిబ్బంది గాలింపు చర్యలను నిలిపివేశారు. తిరిగి రేపు ఉదయం గాలింపు చర్యలు ప్రారంభం కానున్నాయి. గాలింపు చర్యలను పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి స్వయంగా పర్యవేక్షించారు. పలువురు ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకొని సిబ్బందికి సూచలిచ్చారు.
సీలేరు రిజర్వాయర్లో ఈ ఉదయం రెండు పడవలు బోల్తాపడిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో పడవల్లో 11మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా ఒడిశాలోని కోందుగూడ గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. 11మందిలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా ఎనిమిది మంది గల్లంతయ్యారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.