కాచిగూడ,ఆగస్టు 16 : పాలు తీసుకురావడానికి వెళ్లిన భార్య, భర్తలకు గుర్తు తెలియని ద్విక్రవాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలైన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై బి.నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాక డివిజన్ ఆర్టీసీ క్వార్టర్స్ ప్రాంతానికి చెందిన భార్య, భర్తలు జి.కృష్ణకుమార్(58), జి.సునీత(52) ఈ నెల 13వ తేదీన ఉదయం పాలు తీసుకురావడానికి ద్విచక్రవాహనంపై నింబోలిఅడ్డాకు వెళ్లారు.
తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమద్యలో హనుమాన్ దేవాలయ సమీపంలో గుర్తుతెలియని ద్విక్రవాహనం కృష్ణకుమార్,సునీతను ఢీకొనడంతో వారికి తలకు, ఎడమ చేయిలకు తీవ్రంగా గాయాలయ్యాయి. సోమవారం కృష్ణకుమార్ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
భార్య,భర్తలకు గాయాలకు కారణమైన వ్యక్తిపై కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.