అమీర్పేట్, నవంబర్ 3 : అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి నేతృత్వంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షాబాద్ సత్యనారాయణ తన అనుచర వర్గంతో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సత్యనారాయణకు, ఆయన అనుచర వర్గానికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న మంత్రి తలసాని గెలుపునకు పని చేస్తానని సత్యనారాయణ పేర్కొన్నారు.