మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 11: దేశంలోనే అభివృద్ధికి ప్రత్యేక చిరునామాగా తెలంగాణ నిలుస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారంలో శనివారం బీఆర్ఎస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు రంగుల శంకర్ ఆధ్వర్యంలో దమ్మాయిగూడకు చెందిన బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కుడికాల ప్రేమ్ కిషోర్, పద్మశాలి సంఘం అధ్యక్షులు రామకృష్ణ, సంఘం నాయకులు సుదర్శన్, పద్మనాభం, రాము, ప్రసాద్, రాజు, కృష్ణ, శ్రీనివాస్, శేఖర్తో పాటు పలువులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేశారు. వారికి మల్లారెడ్డి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల, మధ్య తరగతి ప్రజలకు అందించారని, తెలంగాణాను అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని, అందుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాల నాయకులు, తదితరులు అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్లోకి చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, పార్టీ అధ్యక్షులు శ్రీధర్, వైస్ చైర్మన్ మల్లేష్, నాయకులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.