డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 18: అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఘటన దురదృష్టకరమని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి అన్నారు. అగ్నిపథ్ను తక్షణమే రద్దు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాకేశ్ మృతికి కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
రూ.50 లక్షల పరిహారంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాకేశ్ కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవడం హర్షణీయమన్నారు. నల్లచట్టాలతో రైతులను ఇబ్బందులకు గురి చేసిన కేంద్రం యువత జీవితాలను సైతం అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. తక్షణమే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి పాల్గొన్నారు.