Pamda Rao Goud | పేదల వైద్య సేవలకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఐదుగురు రోజులకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.8.55 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. లాలాపేటకు చెందిన గిరిమల్ల దుర్గా రావుకు రూ.2.25 లక్షలు, వారాసిగూడకు చెందిన పతంగి విట్టల్ రావుకు రూ.2 లక్షలు, సీతాఫల్మండికి చెందిన పి.సూర్యకాంత్ కు రూ.2.20 లక్షలు, నాగార్జున నగర్కు చెందిన సుంకరి వ్రిశాంక్ కు రూ.లక్ష, రవీంద్రనగర్ కు చెందిన జంగం రేఖకు రూ.1.10 లక్షల ఎల్ఓసీ. పత్రాలను అందించారు.
సీతాఫల్మండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు భారంగా మారిన దశలో వైద్య సేవలను పొందేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు అత్యవసర సందర్భాల్లో సీతాఫల్ మండిలోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. వైద్య సేవలకు అధిక ప్రాముఖ్యతను కల్పిస్తున్నాని పేర్కొన్నారు.