సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అడుగడుగునా పద్మారావు పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు దిష్టి తీసి..మంగళహారతులిచ్చి.. దీవెనలు అందించారు. కారు గుర్తుకే మా ఓటు అంటూ..నినదించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన తరహాలోనే పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. చిలకలగూడ, లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్, శ్రీనివాస్ నగర్ కాలనీ , మహమ్మద్ గూడ, షాబాజ్ గూడ, వారసిగూడ, నామాలగుండు తదితర ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచారం సాగింది. ఆయన వెంట స్థానిక కార్పొరేటర్ హేమ, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రాజు సాగర్, యువ నేత రామేశ్వర్ గౌడ్
తదితరులు ఉన్నారు.