Vande Bharat | సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రెండో వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్లోని పదో నంబర్ ప్లాట్ఫామ్పై సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ఉదయం 11.30 గంటలకు ప్రారంభించనున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు వెల్లడించారు.
రైలు ప్రత్యేకతలు…
తిరుపతికి బుకింగ్ ప్రారంభం
సికింద్రాబాద్ -తిరుపతికి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు శనివారం కొత్తగా ప్రారంభం కాబోతుంది. ఈ నెల 9న సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణికుల కోసం రెగ్యులర్ సర్వీసులు నడిపించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి సికింద్రాబాద్ , తిరిగి మధ్యాహ్నం 3.15కు తిరుపతి నుంచి బయలు దేరుతుందని రైల్వే అధికారులు ప్రకటించారు. రైలులో ప్రయాణించేందుకు శుక్రవారం నుంచి రైల్వే అధికారులు అడ్వాన్స్డ్ టిక్కెట్ బుకింగ్ సౌకర్యం కల్పించారు. ఈ మేరకు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఏసీ చైర్ కార్కు రూ.1680, ఎగ్జిక్యూటివ్ క్లాస్కు రూ.3080 టిక్కెట్ చార్జీలు వసూలు చేయనున్నారు. అలాగే తిరుపతి నుంచి సికింద్రాబాద్కు ఏసీ చైర్ కార్కు రూ.1625, ఎగ్జిక్యూటివ్ క్లాస్కు రూ.3030 చొప్పున టిక్కెట్ చార్జీలు నిర్ణయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.