హైదరాబాద్ : రాచకొండ పరిధిలో ఈ నెల 30, 31 తేదీల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు. ఎంసెట్ పరీక్షల దృష్ట్యా 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంసెట్తో పాటు పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు జరుగున్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ విధించారు. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు.