హైదరాబాద్ : సాహెబ్నగర్ డ్రైనేజీ ఘటనలో గల్లంతైన అంతయ్య ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం బీఎన్రెడ్డినగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పద్మావతినగర్ పైప్లైన్లో మృతదేహం లేదని రూఢీ అయ్యిందన్నారు. అక్కడినుంచి కుంట్లూర్ వరకు ఉన్న ట్రంక్లైన్ మ్యాన్హోళ్లను సిబ్బంది చేత తనిఖీ చేయిస్తున్నామని తెలిపారు.
దాంతోపాటు అవుట్లెట్ అయిన పసుమాముల చెరువులో బోటు బృందాలతో గాలిస్తున్నామని, చెరువు పెద్దగా ఉండడం వలన మరో రెండు బృందాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.10లక్షలు, కాంట్రాక్టర్ నుంచి రూ.5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని పేర్కొన్నారు.
వంద మంది సిబ్బందిని సెర్చ్ ఆపరేషన్లో ఉంచామన్నారు. మరో మృతుడు శివ మృతదేహానికి పంచనామా చేసి, ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సాధ్యమైనంత త్వరగా అంతయ్య మృతదేహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనిల్ చౌదరి, భవాని ప్రవీణ్, శ్రీధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అన్లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?