హైదరాబాద్ : రైలు ప్రయాణికులకు శుభవార్త. ప్యాసింజర్ రైళ్ల పున:ప్రారంభం సందర్భంగా సికింద్రాబాద్ రీజియన్ పరిధిలో మెమూ రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ప్రధానంగా సికింద్రాబాద్ – ఉందానగర్, మేడ్చల్ – ఉందా నగర్ మధ్య ఈ రైళ్లను నడపనున్నారు. ఈ మార్గాల్లో నడిచే మెమూ రైళ్లు.. సీతాఫల్ మండి, ఆర్ట్స్ కాలేజీ, జామై ఉస్మానియా, విద్యానగర్, కాచిగూడ, మలక్పేట, డబీర్ పురా, యాకుత్పురా, ఉప్పుగూడ, ఫలక్నూమా, శివరాంపల్లి, బుద్వేల్ స్టేషన్లలో ఆగనున్నాయి.
మేడ్చల్ వెళ్లే మెమూ రైళ్లను.. మల్కాజ్గిరి, దయానంద్ నగర్, సఫిల్గూడ, రామకృష్ణాపురం గేట్, అమ్ముగూడ, కావల్సి బారక్స్, అల్వాల్, బొలారం బజార్, బొల్లారం, గుండ్ల పోచంపల్లి, గౌడవల్లి స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ మెమూ రైళ్ల వల్ల సబర్బన్ ప్యాసింజర్లకు ఎంతో మేలు చేకూరనుంది. రెగ్యులర్గా సిటీకి వచ్చే ప్రయాణికులకు సమయం కూడా ఆదా కానుంది. ఈ రెండు మార్గాల్లో నడిచే మెమూ రైళ్ల ఛార్జీలను మినిమం రూ. 10, మ్యాగ్జిమం రూ. 15గా నిర్ణయించారు.
సికింద్రాబాద్ – ఉందానగర్ 6:15 – 7:40
సికింద్రాబాద్ – ఉందానగర్ 9:35 – 11:00
సికింద్రాబాద్ – మేడ్చల్ 9:50 – 11:05
సికింద్రాబాద్ – మేడ్చల్ 18:25 – 19:50
సికింద్రాబాద్ – ఉందానగర్ 18:30 – 20:00
సికింద్రాబాద్ – మేడ్చల్ 21:30 – 22:50
ఉందానగర్ – సికింద్రాబాద్ 8:10 – 9:25
మేడ్చల్ – సికింద్రాబాద్ 8:15 – 9:35
మేడ్చల్ – సికింద్రాబాద్ 16:55 – 18:10
ఉందానగర్ – సికింద్రాబాద్ 17:10 – 18:20
మేడ్చల్ – సికింద్రాబాద్ 20:05 – 21:15
ఉందానగర్ – సికింద్రాబాద్ 20:35 – 21:46
ఉందానగర్ – మేడ్చల్ 11:05 – 13:15
మేడ్చల్ – ఉందానగర్ 13:45 – 15:55
మేడ్చల్ – ఉందానగర్ 12:00 – 14:00
ఉందానగర్ – మేడ్చల్ 14:15 – 16:40