Falaknuma Express | హైదరాబాద్ : ఫలక్నూమా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. సికింద్రాబాద్లోని రైల్వే సంచాలన భవన్లో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది నుంచి వివరాలను కమిటీ సేకరిస్తోంది. రెండు రోజుల పాటు వివరాలు సేకరించనున్నారు. ప్రమాదామా..? కుట్ర..? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదంలో సామాగ్రి కోల్పోయిన ప్రయాణికుల వివరాలు కూడా సేకరిస్తున్నారు.
ఈ నెల 7వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా పగడిపల్లి – బొమ్మాయిపల్లి మధ్య ఫలక్నూమా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైల్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి, 5 బోగీలు పూర్తిగా, ఒక బోగీ పాక్షికంగా దగ్ధమైన విషయం విదితమే.