సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తేతెలంగాణ): వర్షాలతో రెండుమూడు రోజులుగా చల్లబడిన నగరం మళ్లీ వేడెక్కుతోంది. ఆదివారం భానుడి ప్రతాపంతో జనసంచారం తగ్గింది.
గరిష్ఠం 39.2, కనిష్ఠం 26.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల రెండ్రోరోజులు మోస్తరు వానలు కురిసే అవకాశముంది.