Supreme Court : హైదరాబాద్లోని చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు పాటుపడుతున్న హైడ్రా (HYDRAA)కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అంబర్పేటలోని బతుకుమ్మకుంటపై నడుస్తున్న వివాదాన్ని హైకోర్టు తేల్చాలని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. బతుకమ్మకుంట ఫెన్నింగ్స్పై హైడ్రా చెబుతున్న అంశాలను పరిశీలించాలని హైకోర్టుకు సూచనలు చేసింది.
భూమి హక్కులకు సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్ ఉన్న నేపథ్యంలో బతుకమ్మకుంట స్థలాన్ని యథాతథంగా ఉంచాలన్న ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించడంపై హైకోర్టు నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. తాము ఆదేశించినప్పటికీ దానిని ఖాతరు చేయకుండా ఆదేశాలకు విరుద్ధంగా పునరుద్ధరణ పనులు చేపట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్య కోర్టు ధిక్కరణేనని తేల్చిచెప్పింది. అయితే.. సుప్రీంకోర్టులో హైడ్రాకు ఊరట లభించింది. బతుకమ్మకుంట కేసుకు సంబంధించిన మొత్తం అంశాలను సమగ్రంగా పరిశీలించిన హైకోర్టుకు తెలిపింది సుప్రీంకోర్టు.
బాగ్ అంబర్పేట్లో సర్వే నంబర్ 563/1 పరిధిలోని 7 గుంటల భూ వివాదంలో ఏ సుధాకర్రెడ్డి హక్కులకు భంగం కలిగించబోమనే హామీకి లోబడి, వరదల నివారణకు పరిమిత పనులు చేపట్టేందుకు హైకోర్టు 2025, జూన్ 12న అనుమతి ఇచ్చింది. ఈ ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించినందున కమిషనర్ రంగనాథ్పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ సుధాకర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.