బేగంపేట్ అక్టోబర్ 30: ముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సనత్నగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సోమవారం వెస్ట్మారేడ్పల్లిలలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని ముస్లింలతో ఏర్పాటు చేసిన సమావేశంలో తలసాని మాట్లాడారు. నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్యాదవ్కు ముస్లింలు తమ సంపూర్ణ మద్థతును ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే నియోజకవర్గం పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించామని చెప్పారు.ముస్లింలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించిదని తెలిపారు. బేగంపేట్లో ముస్లింల ఖబరస్థాన్ను నిర్మించాలని ఎన్నో సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నా గత పాలకులు పట్టించుకోలేదని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం తో 2 ఎకరాల స్థలం నిర్మాణ పనుల కోసం రూ.3 కోట్లు మంజూరు చేసి కల సాకారం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సనత్నగర్ అల్లావుద్దీన్ కోటిలో ఎన్నో సంవత్సరాల నుండి నివసిస్తున్న వారికి గతంలో ఉన్న ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వలేదని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇచ్చామని వారికి యాజమాన్యపు హక్కులు కల్పించామని తెలిపారు. అదే విధంగా హైటెన్షన్ విద్యుత్ లైన్ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పొయారని ఈ ప్రాంత నాయకులు గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొత్తుకున్న పట్టించుకోలేదన్నారు. తాను స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి హై టెన్షన్ విద్యుత్ లైన్లను తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే విధంగా మసీదులు, ఖబరస్తాన్లు అభివృద్ధికి గతం లో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా తమ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. తలసాని సాయికిరణ్యాదవ్, ముస్లిం, మైనార్టీ నాయకులు ఖలీల్, నోమాన్, అఖిల్, ఫహీం, రజాక్, అబ్బాస్, ఆరిఫ్, కరీం తదితరులు పాల్గొన్నారు.