బేగంపేట్: ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం ఎంతో కృషి చేస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శనివారం మోండామార్కెట్, బన్సీలాల్పేట్, రాంగోపాల్పేట్, బేగంపేట్ డివిజన్ల్లో పర్యటించి రూ. 1.32 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా బన్సీలాల్పేట్లోని సీ క్లాస్, సీసీ నగర్, రామస్వామి కాంపౌండ్, రాంగోపాల్పేట్ డివిజన్లోని అవులమంద, మోండా మార్కెట్ బండిమ్మెట్, బేగంపేట్లోని పాటిగడ్డ, భగవంతాపూర్, ఓల్డ్ కస్టమ్స్ బస్తీలలో సివరేజ్ లైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..నూతనంగా చేపట్టిన సివరేజీ వాటర్లైన్ పనులు పూర్తయిన వెంటనే రహదారుల నిర్మాణం చేపడుతామన్నారు. కార్పొరేటర్లు మహేశ్వరి, హేమలత తదితరులు పాల్గొన్నారు.
అడగకుండానే అనేక సంక్షేమ పథకాలు
కోట్ల రూపాయల నిధులతో మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ల రూపు రేఖలను మారుస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేటలో శనివారం రూ.75 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.9.2 కోట్లతో నిర్మాణం చేసిన బడంగ్పేట నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనం, రూ.4.25 కోట్లతో ప్రజా భవనం, రూ.2.40 కోట్లతో కుర్మల్గూడలో 24 కుల సంఘాల భవనాలకు, రూ.4.72 కోట్లతో కుర్మల్గూడలో డీఆర్సీసీ సెంటర్ను నాదర్గుల్లో ధోబీఘాట్ పనులకు తదితర అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అడగ కుండానే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రజలు మళ్లీ ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో బడంగ్పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ గెలుస్తా.. మరింత అభివృద్ధి చేస్తా
ప్రజల ఆశీర్వాదంతో హ్యాట్రిక్ విజయం సాధించి.. మరిన్ని నిధులు సమీకరించి.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. శనివారం మియాపూర్ డివిజన్ పరిధిలో రూ.7.47 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి శంకుస్థాపన చేశారు. చందానగర్లో రూ. 3.06 కోట్లతో పలు కాలనీల్లో అభివృద్ధి పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.