సైదాబాద్, ఆగస్టు 1 : సైదాబాద్ కొత్త పోలీస్స్టేషన్ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రూ. 4 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో చేపట్టిన పనులు చివరి దశకు చేరాయి. పాత పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరటంతో దాన్ని కూల్చివేసి 2016లో కొత్త పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. పంద్రాగస్టు నాటికి పనులను పూర్తిచేసి జెండా ఇక్కడే ఎగవేసే విధంగా పనులను జోరందుకున్నాయి. పోలీస్స్టేషన్తోపాటు అదేఆవరణలో కొనసాగుతున్న మహిళా కౌన్సెలింగ్ సెంటర్ (భరోసా కేంద్రం) పనులు పూర్తయ్యాయి.
భరోసా సెంటర్ నిర్మాణం పూర్తి ..
పోలీస్ స్టేషన్ ఆవరణలోనే భరోసా సెంటర్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. పోలీస్స్టేషన్ పక్కనే భరోసా కేంద్రం ఉండటంతో మహిళల్లో ఆత్మైస్థెర్యం పెంచటానికి ఉపయోగ పడుతుంది. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. భరోసా సెంటర్లో ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతులు, సౌకర్యాలు వంటి పనులను పూర్తిచేయటంతో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఒకే దగ్గర మలక్పేట ఏసీపీ ఆఫీస్, పోలీస్ స్టేషన్, భరోసా కేంద్రాలు కొలువుదీరనున్నాయి.
పంద్రాగస్టు నాడు ప్రారంభోత్సవానికి సన్నాహాలు ..
సైదాబాద్ ఎస్బీహెచ్ – బీ కాలనీ కమ్యూనిటీ హాల్లో కొనసాగుతున్న పోలీస్స్టేసన్ను అక్కడి నుంచి ఖాళీ చేసి ఇక్కడే పాత ప్రాంతానికి రానుంది. తాత్కాలికంగా కాలనీలో ఉన్న పోలీస్స్టేషన్ వలన ప్రజల ఇబ్బందులను మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పనులను త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. సైదాబాద్లో ఫైఓవర్ బిడ్రి నిర్మాణంతో రోడ్డు విస్తరణలో భాగంగా మలక్పేట ఏసీపీ కార్యాలయం పూర్తిగా కోల్పోతుండటంతో ఏసీపీ కార్యాలయాన్ని ఇదే భవనంలో ఏర్పాటు చేస్తే సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఒకవైపు పోలీస్స్టేషన్, మరోవైపు ఏసీపీ కార్యాయానికి తక్షణ అవసరాలు ఉండటంతో భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి.