సైదాబాద్, ఫిబ్రవరి 6 : కంటి సంబంధమైన ఇబ్బందులు ఉన్నవారందదూ కంటి వెలుగు కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ అన్నారు. సోమవారం ఎస్బీహెచ్ జీఏ-1 కాలనీ పద్మావతి కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కేంద్రాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. పేదలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం కంటి వెలుగు కేంద్రాలను ఏర్పాటుచేసి పరీక్షలు చేసి, మందులు, కండ్ల అద్దాలను అందజేస్తుందని అన్నారు.
ఎస్బీహెచ్ పంచకాలనీల ఉద్యోగులు, అధికారులు, కాలనీవాసులకు అందుబాటులో ఉన్న పద్మావతి కల్యాణమండపంలో కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, కాలేజీల నిర్వాహకులు అందుబాటులో ఉండే ప్రదేశాలను తెలిపితే తాత్కాలిక కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో కంటి వెలుగు కేంద్రం ఇన్చార్జి డాక్టర్ మౌనిక, క్వాలటీ చెకింగ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరి, నీరజ, వై.ఎన్.మూర్తి, కాలనీవాసులు పాల్గొన్నారు.