కాచిగూడ, నవంబర్ 3: దీపావళి పండుగను పురస్కరించుకుని హర్యానా రాష్ట్రం నుంచి ప్రసిద్ధిగాంచిన బహుబలి దున్నపోతును రూ.5 కోట్లు ఖర్చు చేసి చెప్పల్బజార్కు తీసుకువచ్చారు. కాచిగూడకు చెందిన అఖిల భారతీయ యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టబోయిన నందకిశోర్ యాదవ్, సభ్యులు లడ్డూయాదవ్, సి.సందీప్యాదవ్లు హర్యానా రాష్ట్రం, పానిపాట్ గ్రామానికి చెందిన బహుబలి దున్నపోతును రూ.5 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా నందకిశోర్ యాదవ్ మాట్లాడుతూ ఈ బహుబలి దున్నపోతుకు రోజువారి ఖర్చు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు అవుతుందని, యేడాదికి రూ.10లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఆదాయం ఉంటుందని పేర్కొన్నారు. ఈ బహుబలి దున్నపోతుతో మూడు రోజుల పాటు చెప్పల్బజార్ గ్రౌండ్లో పలు రకాల ప్రదర్శనలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 6వ తేదీ శనివారం నారాయణగూడలో నిర్వహించే సదర్ వేడుకల్లో ఈ బహుబలి దున్నపోతు వినూత్న విన్యాసాలు చేయనున్నట్లు నందకిశోర్ యాదవ్ తెలిపారు.