TSRTC | హయత్నగర్: విజయవాడ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృషించింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. హయత్నగర్ ఇన్స్పెక్టర్ నిరంజన్ తెలిపిన వివరాల ప్రకారం… దిల్సుఖ్నగర్కు డిపోకు చెందిన బస్సు చౌటుప్పల్ నుంచి బయలుదేరింది.
విజయవాడ జాతీయ రహదారిపై హయత్నగర్లోని భాగ్యలత కాలనీ వద్ద బస్సు కింద శబ్ధం రావడంతో డ్రైవర్ ధర్మయ్య అప్రమత్తమై బ్రేక్ వేసినా..అదుపులోకి రాలేదు. వెంటనే హ్యాండ్ బ్రేక్ను వేయగా ముందు వెళ్తున్న రెండు ఆటోలు, రెండు బైక్లు, రెండు కార్లను ఢీకొట్టి నిలిచిపోయింది.
ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఆర్టీసీ హైదరాబాద్ రీజినల్ మేనేజర్ వరప్రసాద్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ జగన్ తదితరులు పరిశీలించారు.