హైదరాబాద్ : హయత్నగర్(Hayathnagar)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు(
RTC bus) బ్రేక్ ఫెయిల్( Brake failed) అయి వాహనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకరసంఘటన హయత్ నగర్ పరిధిలోని భాగ్యలత అయాన్ డిజిటల్ సెంటర్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దిల్సుఖ్ నగర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందున్న రెండు ఆటోలు, ఆనే బైకులు, రెండు కార్లను బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఓ ఆటోలోని మహిళ తల పగులగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పోలీస్ స్టేషన్ తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బస్సు బ్రేక్ ఫెయిలైందని డ్రైవర్ అరిచాడని స్థానికులు తెలిపారు.