అన్నపూర్ణ భోజన కేంద్రాలు పేదల పాలిట అక్షయపాత్రగా మారాయి. ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదనే ముఖ్యమంత్రి సంకల్పంతో 2014 నుంచి ఐదు రూపాయలకే భోజనం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 10.88 కోట్ల మందికిపైగా భోజనం అందించి దేశంలోనే అతిపెద్ద భోజన పథకంగా నిలిచింది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 216.01 కోట్లు ఖర్చు చేసింది. హైదరాబాద్ నగరానికి ఆయా పనులు, వివిధ వృత్తులు చేసుకునేందుకు వచ్చిన వారే కాకుండా విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్నపూర్ణ పథకం వారి దైనందిన జీవితంలో భాగమైంది. రుచి, శుచి సమతుల పోషకాలతో ఆహారాన్ని అందిస్తుండడంతో వలస కార్మికులు, విద్యార్థులు, బ్యాచిలర్లు, చిరుద్యోగులు కడుపు నింపుకుంటున్నారు. రోజురోజుకు అన్నపూర్ణ భోజనాలకు ఆదరణ పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సకల సౌకర్యాలతో అన్నపూర్ణ భోజనశాలగా మార్చుతున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 32 అన్నపూర్ణ క్యాంటీన్లలో సిట్టింగ్ ఏర్పాటు చేసి ప్రైవేట్ భోజనశాలలకు ఏ మాత్రం తీసిపోకుండా అన్నపూర్ణ కేంద్రాలను మలిచారు. సకల సదుపాయాలు కల్పిస్తూ ఆకలి తీర్చడమే కాకుండా సంతృప్తిగా భోజనం చేశామన్న అనుభూతిని కల్పించేలా చర్యలు చేపట్టారు.
– సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ)
గ్రేటర్లో ఆమలు చేస్తున్న రూ. ఐదు రూపాయల అన్నపూర్ణ భోజన పథకం ఎంతో మంది నిరుపేదల ఆకలిని తీర్చుతున్నది. హరే కృష్ణ మూవ్మెంట్తో కలిసి 1 మార్చి, 2014న 8 కేంద్రాలతో ప్రారంభమైన ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను గుర్తించి 259 కేంద్రాలకు పెంచేసింది. ప్రతి కేంద్రం ద్వారా రోజుకు 300 భోజనాలు అందించాలని లక్ష్యంగా ఒక రోజుకు మొత్తం 45 వేల మందికి భోజనాలు అందిస్తున్నారు. హైదరాబాద్ నగరానికి ఆయా పనులు, వివిధ వృత్తులు చేసుకునేందుకు వచ్చిన వారే కాకుండా విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్నపూర్ణ పథకం ఆసరగా నిలుస్తోంది. కాగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారి కుటుంబ సభ్యులకు టిఫిన్, భోజన వసతి కోసం వ్యయ ప్రయాసలు ఇబ్బంది కలగకుండా వారికి సీఎం కేసీఆర్ టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి పూట మూడు పూటలు భోజనం అందిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ పెద్ద ఆస్పత్రులకుగాను 17 ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ. 5లకే అందిస్తున్నది.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారి కుటుంబ సభ్యులకు టిఫిన్, భోజన వసతి కోసం వ్యయ ప్రయాసలకు ఇబ్బంది కలుగకుండా సీఎం కేసీఆర్ మూడు పూటలు భోజనం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రూ.5 లకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి పూట భోజనం అందిస్తున్నారు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ పెద్ద ఆస్పత్రులకుగాను 17 ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ. 5లకే అందించేందుకు గత మే నెల 2వ తేదీన ప్రారంభించారు. ప్రతి రోజు మూడు పూటలకు సుమారు 8 వేలపైగా భోజనాలు అందించేందుకు టార్గెట్ పెట్టారు. హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా అందజేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నగరంలోని ప్రధాన ఆసుపత్రులు ఈఎన్టీ, ఉస్మానియా, మహావీర్ ఆసుపత్రి, నిలోఫర్, కోఠి మెటర్నిటీ, నిమ్స్, నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో మొత్తం 900 మందికి ప్రయోజనం చేకూర్చే విధంగా జీహెచ్ఎంసీ ద్వారా రూ. 10.68 కోట్ల వ్యయంతో 7 నైట్ షెల్టర్లు నిర్మించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మే నెల నుంచి నవంబర్ వరకు రూ. 212.50 కోట్ల ఖర్చు చేసి 8 లక్షల 09 వేల 530 భోజనాలు రూ. 5/- లకే అందించినట్లు అధికారులు పేర్కొన్నారు.
కరోనా సమయంలో రవాణా సౌకర్యం లేక ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ప్రభుత్వం మానవీయ కోణంతో ఆలోచించి ఉచితంగా భోజన వసతి కల్పించింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా నిర్ణయం తీసుకొని ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ప్రభుత్వ ఖర్చుతో వారి సొంత గ్రామాలకు పంపించే ఏర్పాటు చేశారు. ప్రయాణ సమయంలో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి గ్రామానికి చేరుకునే వరకు కావాల్సిన పండ్లు, భోజనం, త్రాగు నీరు సౌకర్యం కల్పించిన ఘనత ఈ రాష్ట్రానికే దకుతుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా శాశ్వతంగా ఉన్న కేంద్రాలతో కలిపి మొత్తం 373 కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా రాత్రి సమయంలో కూడా భోజనం అందించేందుకు 259 మొబైల్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పీరియడ్లో మొత్తం 2, 29, 46, 080 మందికి ఉచితంగా డిన్నర్ అందించినట్లు అధికారులు పేర్కొన్నారు.
అన్నపూర్ణ కేంద్రాల్లో ప్రజలు ప్రశాంతంగా కూర్చొని భోజనం చేసేందుకు సీటింగ్ ఏర్పాటు కోసం ప్రయోగాత్మకంగా మొత్తం 8 ప్రదేశాలలో నిర్మాణాలు చేపట్టి అందుబాటులోకి తెచ్చారు. సరూర్ నగర్ సరిల్లో ఎన్టీఆర్ వెజిటేబుల్ మారెట్ కొత్తపేటలో కేంద్రంలో సీటింగ్ ఏర్పాటు చేశారు. కార్వాన్ సరిల్లో టోలిచౌకి, లంగర్ హౌస్ ఫె్లై ఓవర్ కింద 2 కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ సరిల్లో సత్యం థియేటర్ వద్ద, చందానగర్ సరిల్ అవాసా ఎదురుగా మాదాపూర్, మూసాపేట్ సరిల్లో బాలానగర్ నర్సాపూర్ ఎక్స్ రోడ్డు, బాలానగర్ మెయిన్ రోడ్డులోని ఇందిరా నగర్, గాజులరామారం సూల్లో సూరారంలోని మల్లారెడ్డి హాస్పిటల్ వద్ద గల కేంద్రాలకు సీటింగ్ సౌకర్యం కల్పించారు.