చర్లపల్లి, డిసెంబర్ 21 : చర్లపల్లి డివిజన్, భరత్నగర్ రైల్వే క్రాసింగ్ ఆర్ఓబీ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆర్ఓబీ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల నిధులు కేటాయించిన సందర్భంగా బుధవారం ఆయన బ్రిడ్జిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఆర్ఓబీ పనులు చివరిదశకు చేరుకున్నాయని, బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో స్థానికులు, కార్మికులు, వా హనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపా రు. ఈ పనులకు సంబంధించి నిధులు మంజూరు చే యాలని మంత్రులు కేటీఆర్, ప్రశాంత్రెడ్డిల దృష్టికి తీసుకువెళ్లగా.. వారి సహకారంతో ప్రభుత్వం రూ.2కోట్ల నిధు లు మంజూరు చేసిందన్నారు. వెంటనే పనులు ప్రారంభించి.. త్వరలో బ్రిడ్జిని అధికారికంగా ప్రారంభించేందు కు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా అధికారులు పరిశీలించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, ఎస్సైలు సాయికుమార్, ప్రసాద్, నాయకులు నేమూరి మహేశ్గౌడ్, జాండ్ల ప్రభాకర్రెడ్డి, సుధాకర్, నందికంటి శివ, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు గిరిబాబు, అనిల్ముదిరాజ్, పద్మారెడ్డి, కడియాల బాబు, గంప కృష్ణ, వినోద్ ముదిరాజ్, నందకిశోర్, ఉపేందర్, రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
– అనంతరం చిన్న చర్లపల్లిలోని ఇందిరా గృహకల్ప కాలనీ, నేతాజీ నగర్లలో ఎమ్మెల్యే పర్యటించి.. స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్న చర్లపల్లి నుంచి ఇందిరాగృహకల్ప కాలనీకి వెళ్లే రహదారిలో ఉన్న బ్రిడ్జిని పూర్తి చేసేందుకు నిధులు కేటాయించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రహదారిలో కూలిపోయిన బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.