Hyderabad | మద్యం మత్తులో జ్యూవెలరీ షాష్లో(jewellery sho) రౌడీ షీటర్లు( Rowdies) వీరంగం సృష్టించారు. షాప్ మేనేజర్ను బెదిరించి డబ్బులు ఇవ్వాలని ఇద్దరు దుండగులు డిమాండ్ చేశారు. ఈ సంఘటన బంజారాహిల్స్ రోడ్ -10లోని శ్రీసాయి జగదాంబ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ షోరూమ్లో చేసుకుంది.
అలీమ్, యూసుఫ్ అనే ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి లక్షల రూపాయలు డిమాండ్ చేశారని షాప్ మేనేజర్ పంకజ్ తెలిపారు. ఈ మేరకుపోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.