సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : లోకసభ ఎన్నికల(Lok Sabha elections) నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు రూ.3.28 లక్షల నగదును పట్టుకొని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్(Ronald Rose) తెలిపారు. కోటి 13 లక్షల రూపాయల విలువ గల ఇతర వస్తువులు పట్టుకున్నట్లు చెప్పారు.
వీటితో పాటు 18,752 లీటర్ల మద్యం పట్టుకొని 122 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 2,144 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు చెప్పారు. కాగా, గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.9.54 లక్షలు పట్టుకున్నట్లు తెలిపారు. ఐదుగురిపై ఎఫ్ఐఆర్, ఆరు లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు రోనాల్డ్రోస్ చెప్పారు.