వాహనదారులకు సమస్యలు లేకుండా అధికారుల ప్రత్యేక చర్యలు
నగరంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా నిర్వహణ
అబిడ్స్, మార్చి 16 : ఖైరతాబాద్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నూతన రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సీఆర్ఎంపీ రోడ్లతో పాటు ఇంజినీరింగ్ విభాగం అధికారులు పలు ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. సరోజినిదేవి దవాఖాన నుంచి ఎన్ఎండీసీ వరకు, టోలిచౌకి ఫ్లై ఓవర్ నుంచి హ్యాండ్ సింబల్ నానల్నగర్ జంక్షన్ వరకు నూతన రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. జియాగూడ 2 జె బస్స్టాపు వద్ద , బషీర్బాగ్ ఫ్లై ఓవర్పై పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనులను అధికారులు పర్యవేక్షించి నాణ్యతను పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. నాణ్యతను యంత్రాలతో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలను చేస్తున్నారు. ఖైరతాబాద్ జోన్ జోనల్ కమిషనర్ రవికిరణ్ పర్యవేక్షణలో ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ ఆధ్వర్యంలో పనులు సాగుతున్నాయి.
రాకపోకలకు ఆటంకం లేకుండా ..
రోడ్లపై వాహనాల రాకపోకలకు ఆటంకం ఉండకుండా ఉండేందుకు గాను అధికారులు రహదారుల నిర్మాణ పనులను చేపడుతున్నారు. ప్రధాన రహదారులు సీఆర్ఎంపీలోకి వస్తుండడంతో ఆ రోడ్లతో పాటు ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో బస్తీల్లో రహదారుల నిర్మాణ పనులను చేపడుతున్నారు. గుంతలు పడిన రహదారులలో గుంతలను పూడ్చడం, అవసరమైన ప్రాంతాల్లో నూతన రహదారుల నిర్మాణ పనులను చేపడుతున్నారు. నగరాభివృద్ధిలో భాగంగా సమస్యాత్మక రోడ్లను గుర్తించి నిర్మాణాలు చేపడుతున్నారు.
పనులు కొనసాగుతున్నవి.. – సహదేవ్ రత్నాకర్, ఎస్ఈ ఖైరతాబాద్ జోన్
నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోని గుంతలమయమైన రహదారులను గుర్తించి మరమ్మతులు చేపడుతున్నాం. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వాహనదారుల ప్రయాణం సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటున్నాం. జోన్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో అభివృద్ధి పనులను నాణ్యతతో చేపడుతున్నాం.