KTR | ఏదైనా సినిమాది ట్రైలర్ రిలీజ్ కాగానే మన పిల్లలు హిట్టా ఫట్టా ని చెప్పేస్తున్నరు. సినిమా టీజర్ రిలీజ్ కాగానే చెప్తున్నరు. సినిమా ట్రైలర్ చూడంగానే సినిమా ఏట్లా ఉందో చెప్పే సత్తా ఉన్న తెలంగాణకు రేవంత్ రెడ్డిది ఇంటర్వెల్ అయేపాయె. ఇక శుభం కార్డు పడి వెళ్లగొట్టేదే ఉన్నది. ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్. 50 శాతం టైం అయిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, పార్టీకి చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎస్ఐఆర్, పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సింపుల్గా చెప్పాలంటే హైదరాబాద్లో ఒక ఇటుక పెట్టలేదు.. ఇల్లు కట్టలేదు. హైడ్రా పేరు మీద కొన్ని వేల వందల ఇండ్లను కూలగొట్టిండు. శనివారం, ఆదివారం వచ్చిందంటే గరీబోళ్ల కొంపల మీద పడి.. ఎక్కడికక్కడ ఇండ్లు కూలగొట్టి దరిద్రపు పేరు సంపాదించుకున్నడు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి మనిషి అని చెప్పేందుకు ఆ ఒక్కఉదాహరణ చాలని కేటీఆర్ అన్నారు.
గరీబోళ్లు తెలిసో తెలియకో ఇళ్లు కట్టుకుంటే కేసీఆర్ 2 లక్షల 50 వేల మంది ఇండ్లకు జీవో నంబర్ 58, 59 కింద పట్టాలిచ్చిన మహానాయకుడు అని కేటీఆర్ స్పష్టం చేశారు. హదరాబాద్లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించిండు. ఒక్కో నియోజకవర్గానికి 3 వేల చొప్పున ఇప్పటికే ఇచ్చినం. ఇంకో వెయ్యి వీళ్లు ఇస్తున్నరు. మొత్తం తయారు చేసి పెడితే దానికి సున్నం మేమే వేసినం అని చెప్పేవాళ్లు వీళ్లని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Live: ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం
📍 తెలంగాణ భవన్ https://t.co/KeSKthLWFL
— BRS Party (@BRSparty) June 14, 2026