ఖైరతాబాద్, అక్టోబర్ 30 : రోడ్డు ప్రమాదంలో ఓ విశ్రాంత హెడ్కానిస్టేబుల్ మృతి చెందాడు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. ఏపీకి చెందిన మాజీ హెడ్ కానిస్టేబుల్ కనకరాజు (63) అమీర్పేట రోడ్డులోని అమ్మవారి దేవాలయం వద్ద రోడ్డు దాటుతుండగా, వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కనకరాజు అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. ఇదిలా ఉండగా.. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఆర్టీసీ డ్రైవర్కు ఫిట్స్ రావడంతో అతడిని ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.