శంషాబాద్, ఆగస్టు 22 : జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్( శంషాబాద్) ఆదివారం హైదరాబాద్ నుంచి మాల్దీవులలోని మాలెకు విమాన సర్వీసులు పునఃప్రారంభించింది. ఇండిగో మొట్టమొదటగా ప్రారంభించినట్లు ఎయిర్పోర్టు కమ్యూనికేషన అధికార వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి మాలె విమాన సర్వీసులు పునఃప్రారంభం చేసిన ఎయిర్పోర్టు సీఈఈఓ ప్రదీప్ ఫణికర్, ఇతర అధికారులు ప్రయాణికులకు వీడ్కోలు పలికారు.
ఇండిగో విమానం 6ఇ 8108 మధ్యాహ్నం 2.20 హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలు దేరి సాయత్రం 4.30 గంటలకు మాల్దీవులలోని వెలాన అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తిరిగి రాత్రి 08.50కి 6ఇ 8107 విమానం హైదరాబాద్ రానుంది. వారంలో 3 రోజులు ( మంగళ, గురు, ఆదివారాలు ) నడుస్తాయి.
ఈ సందర్భంగా ఎయిర్పోర్టు సీఈఓ ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ మాల్దీవులకు విమాన సర్వీసులు పునః ప్రారంభంతో పర్యాటకులకు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. జల క్రీడాకారులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు.