సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని భారీ వాహనాలపై ఆంక్షలు విధించడంతో పాటు కొన్ని నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ డీసీపీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాహనదారులు, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు కొన్ని ఆంక్షలు, నిబంధనలను అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా భారీ వాహనాల రాకపోకలపై పలు ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.
ఆంక్షలు..