బండ్లగూడ, సెప్టెంబర్ 7: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో మంచి నీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని బండ్లగూడ జలమండలి కార్యాలయం వద్ద పలు కాలనీల ప్రజలు సోమవారం ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ నాయకులు రావుల కోళ్ల నాగరాజు మాట్లాడుతూ వారానికి ఒక సారి కూడా నీటి సరఫరా లేదన్నారు.
తద్వారా సంజయ్గాంధీ నగర్ కాలనీ,యాదయ్యనగర్ కాలనీ, ఇండస్ వ్యాలీ, సాయి బాలాజీనగర్, వెంకటేశ్వర కాలనీ, 60 గజాల వికార్ సెక్షన్ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అనంతరం ఆయన కాలనీల ప్రజలతో కలిసి మంచినీటి సరఫరాను మెరుగుపర్చాలంటూ.. బండ్లగూడ మేనేజర్ నరేశ్ను కలిసి వినతి పత్రం అందజేశారు.