బన్సీలాల్పేట్ : బన్సీలాల్పేట్ డివిజన్లోని పలు బస్తీలలో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం బన్సీలాల్పేట్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు జావేద్ మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు.
చాచానెహ్రూనగర్, బన్సీలాల్పేట్, బోయిగూడలలో నెలకొన్న సమస్యలను వారు మంత్రికి వివరించారు. టిఆర్ఎస్ నాయకులు కే.లక్ష్మిపతి, డి.శ్రీనివాస్, రుక్ముద్దీన్, అన్వర్, హుస్సేన్, జహంగీర్, ఫజల్, షకీల్ పాల్గొన్నారు.