హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని పోలీసు స్టేషన్లలో జాతీయ జెండాను ఎగురవేశారు. బషీర్బాగ్లోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సీవీ ఆనంద్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో అడిషనల్ సీపీ(లా అండ్ ఆర్డర్) డీఎస్ చౌహాన్తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు, పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు సీపీ ఆనంద్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.