3 జిల్లాలు.. రూ.6,655.28 కోట్లు
రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరిన మొత్తం
రాష్ట్ర ఆదాయంలో సగం ఇక్కడి నుండే
మొత్తం డాక్యుమెంట్లు 4,77,009
సిటీబ్యూరో, మార్చి 31 : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మూడు జిల్లాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,655.28 కోట్లు ఆదాయం వచ్చినట్లు రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు వెల్లడించారు. 2021 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ఈ మొత్తం వచ్చినట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,500 కోట్ల ఆదాయంలో సగ భాగం ఈ మూడు జిల్లాల నుంచే రావడం విశేషం.