న్యాయమూర్తులు, న్యాయ వాదులను ఉద్దేశించి
‘రంగారెడ్డి’ ప్రధాన న్యాయమూర్తి సీహెచ్కే భూపతి
రంగారెడ్డి జిల్లా కోర్టులు, జూన్ 13(నమస్తే తెలంగాణ): న్యాయమూర్తులు, న్యాయ వాదుల మధ్య సత్సంబంధాలుంటేనే కేసులు సత్వరమే పరిష్కారం అవుతాయని రంగారెడ్డి జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తి సి.హరేకృష్ణ భూపతి అన్నారు. రంగారెడ్డి జిల్లా నూతన న్యాయమూర్తుల పరిచయం జిల్లా కోర్టుల బార్ అసోసియేషన్ హాల్లో అసోసియేషన్ అధ్యక్షుడు తోటపల్లి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సోమవారం జరిగింది. ఇటీవల నూతన జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియామకమైన సి.హరేకృష్ణ భూపతి మాట్లాడుతూ, న్యాయమూర్తులకు న్యాయవాదులకు సంబంధాలు బాగుంటేనే కేసులు సత్వర పరిష్కారం అవుతాయని, న్యాయవాదులకు కోర్టులో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ప్రతిభావంతులైన న్యాయమూర్తులు జిల్లా కోర్టులో ఉన్నారని పెండింగ్ కేసులను త్వరగా పరిష్కారానికి అందరూ కృషి చేయాలని కో రారు. హస్తినపురంలో ఏర్పాటు చేసిన కోర్టులను తిరిగి జిల్లా కోర్టుల ప్రాంగాణానికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని న్యాయమూర్తి సి.హరేకృష్ణ భూపతి హామీ ఇచ్చారు. నూతనంగా బదిలీపై వచ్చిన న్యాయమూర్తులు శివ కుమా ర్, జయప్రసాద్, అఫ్రోజ్ అక్తర్, సూర్య చంద్రకళ, హరీషా, హిమబిందు, శిరీష, రవిలకు ఘనంగా స్వాగతం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్ర భుత్వ న్యాయవాది రాజేశ్వర్ రావు, పీపీ కొంగర రాజిరెడ్డి, బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ ఎం.రాజేందర్రెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు అనంతసేన్రెడ్డి, ఎం.పి.భార్గవ్, జి.రామారావు సీనియర్ న్యాయవాదులు దండెం రాంరెడ్డి, సదానందం, రాజీవ్రెడ్డి పాల్గొన్నారు.