కేపీహెచ్బీ కాలనీ, జూలై 7 : జేఎన్టీయూహెచ్లో ఇద్దరు విద్యార్థులపై ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు దాడి చేశారు. గురువారం బాధిత విద్యార్థులకు అండగా వర్సిటీలోని జేఎన్టీయూహెచ్ జేఏసీ, బంజారా, ఎస్సీ ఎస్టీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు ర్యాలీని చేపట్టారు. దీనికి వ్యతిరేకంగా ఏబీవీపీ నేతలు ర్యాలీని చేపట్టడం.. వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట బైఠాయించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కేపీహెచ్బీ కాలనీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను శాంతించే ప్రయత్నం చేశారు. కానీ.. ఏబీవీపీ నేతలు వర్సిటీ పరిపాలనా భవనంలోని వైస్ చాన్స్లర్ ఛాంబర్లోకి దూసెకెళ్లే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో పలు వస్తువులను ఏబీవీపీ నాయకులు ధ్వంసం చేశారు. కేపీహెచ్బీ కాలనీ సీఐ, వర్సిటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జేఎన్టీయూహెచ్ వర్సిటీలో మెటలార్జికల్ ఇంజినీరింగ్ విభాగంలో కిశోర్కుమార్, జయసూర్యలు ఫోర్త్ ఇయర్ చదువుతున్నారు. లాప్టాప్ విషయంలో కిశోర్కుమార్, జయసూర్య లతో గొడవ మొదలు కాగా బుధవారం రాత్రి కిశోర్కుమార్, జయసూర్యలను ఏబీవీపీ నేతలు దాడిచేసి గాయపర్చారు.
ఈ విషయంపై బాధిత విద్యార్థులిద్దరూ కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా.. గురువారం ఉదయం బాధిత విద్యార్థులు కిశోర్కుమార్, జయసూర్యలపై దాడి చేసిన ఏబీవీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వర్సిటీలోని జేఏసీ, బంజారా, ఎస్సీ ఎస్టీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు ర్యాలీ నిర్వహించి వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట బైఠాయించారు. ఈ ర్యాలీని నిరసిస్తూ ఏబీవీపీ నేతలు సైతం ర్యాలీని చేపట్టి పరిపాలనా భవనం వద్దకు చేరుకున్నారు. రెండు వర్గాల విద్యార్థి సంఘాల నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో కేపీహెచ్బీ కాలనీ పోలీసులు వర్సిటీకి చేరుకుని శాంతించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఏబీవీపీ నేతలు వర్సిటీ వైస్ చాన్స్లర్ ఛాంబర్ వైపు దూసుకెళ్లారు. ఎస్టాబ్లిష్మెంట్ భవనంలో పలు వస్తువులను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు 20మంది ఏబీవీపీ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.