Hyderabad | మైలార్దేవ్పల్లి, ఆగస్టు 26: ఒకే నంబర్తో ఉన్న రెండు ఆటోలను గుర్తించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మైలార్దేవ్పల్లి డివిజన్ దుర్గానగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామి, ఇతర సిబ్బందితో కలిసి విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో టీఎస్15యూఎఫ్ 1543 నంబర్తో ఉన్న రెండు ఆటోలు కనిపించాయి.
వెంటనే ఆ రెండు ఆటోలను ఆపి వివరాలను సేకరించారు. అందులో ఒకటి ఒరిజినల్ రిజిస్ట్రేషన్ ఆటో కాగా.. మరొకటి డమ్మి నంబర్ ప్లేట్గా గుర్తించారు. అక్రమంగా ఒకే రిజిస్ట్రేషన్ నంబర్తో రెండు ఆటోలను నడిపిస్తున్నట్లు గుర్తించారు. రెండు ఆటోలను సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం మైలార్దేవ్పల్లి పోలీసులకు అప్పగించారు.