Hyderabad | హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లో గుప్త నిధులు కలకలం రేపాయి. బుద్వేల్ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో సోమవారం రాత్రి పలువురు దుండగులు తవ్వకాలు జరిపారు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. 9 మందిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
నిందితుల నుంచి మూడు కార్లు, 16 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.