Raja Singh | మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కుట్రల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖను రాజీనామా చేయాలని హైకమాండ్ ఆదేశించిందని.. ఈ నేపథ్యంలో ఆమె భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
డబ్బుల వాటాల పంపిణీలో తేడా కారణంగానే కొండా సురేఖను బయటకు పంపుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే అవినీతికి మారుపేరని.. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇదే విషయం అర్థమవుతోందన్నారు.
తన కూతురు కొండా సుస్మిత సీఎం రేవంత్ పై చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో కొండా దంపతులు హైకమాండ్తో తాడోపేడో తేల్చుకునేందుకు సమాయత్తమవుతున్నట్టు ఓ వైపు వార్తలు వస్తుండగా.. మరోవైపు మంత్రి కొండా సురేఖ దంపతులు నేడు హైదరాబాద్లో తమ అనుచరులతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Rashmika | భర్త విజయ్తో మూడు నెలల తర్వాత ఫుల్ క్వాలిటీ టైమ్.. నేచరే ఇలా చేసిందేమో ..
ACB | సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య నివాసంలో ఏసీబీ మెరుపు దాడులు