నగరంలో 41.4 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
ద్రోణి ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలు
మూడ్రోజులు మోస్తరు వానలు కురిసే అవకాశం
సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): నగరంలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నానికి 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణ శాఖ గ్రేటర్కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
అధిక ఉష్ణోగ్రతలతో పాటు ద్రోణి ప్రభావం వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వచ్చే మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వానలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. రెండ్రోజులుగా ద్రోణి ప్రభావం లేకపోవడంతో పగలు ఎండ, రాత్రి ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.