సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఇందులో తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి, కాజీపేట్-తిరుపతి, హైదరాబాద్-నర్సాపూర్, హైదరాబాద్-తిరుపతి, విజయవాడ-నాగర్సోల్, మచిలీపట్నం-సికింద్రాబాద్, తిరుపతి-సికింద్రాబాద్, ధర్మవరం-మచిలీపట్నం వంటి పలు స్టేషన్ల పరిధిలో 22 ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఈ రైళ్లు అక్టోబర్ మొదటి వారం నుంచి డిసెంబర్ 1 వరకు రైలు సర్వీసులు, తేదీల వారీగా రాకపోకలు కొనసాగిస్తాయన్నారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో మొత్తం 36 రైళ్లను రద్దు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆయా రైల్వే మార్గాల్లో నిర్వహణ, అభివృద్ధి పనులు వల్ల కలిగే అంతరాయం వల్ల రైళ్లను రద్దు చేశామన్నారు. వీటిలో విజయవాడ డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో 16 రైళ్లు, గుంటూరు డివిజనల్ రైల్వే పరిధిలో 14, హైదరాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో 2, గుంతకల్ డివిజనల్ రైల్వే పరిధిలో 4 రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే ఆయా రైల్వే మార్గంలో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ రైళ్లు అక్టోబర్ 2 నుంచి 8 వరకు రద్దు అవుతాయన్నారు.