హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): సీనియర్ సిటిజన్లతోపాటు జర్నలిస్టులకు రాయితీని కొనసాగించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. జర్నలిస్టులకు రైల్వే పాస్ల జారీ ప్రక్రియను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. రాష్ట్ర జర్నలిస్టులు సమీపంలోని రైల్వేస్టేషన్లలో పాస్లు పొందాలని తెలంగాణ రాష్ట్ర వరింగ్ జర్నలిస్టుల సం ఘం (టీయూడబ్ల్యూజే) ఆదివారం ఒక ప్రకటనలో సూచించింది.
రైలు ప్రయాణంలో జర్నలిస్టులకు రాయితీని నిలిపివేస్తున్నట్టు కేంద్రం గతంలో ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్రెడ్డి, బల్విందర్సింగ్ రైల్వే బోర్డు ఉన్నతాధికారులు, కేంద్ర మంత్రులను సంప్రదించారు.
రైలు ప్రయాణాల్లో జర్నలిస్టులకు రాయితీని కొనసాగించాలని వినతిపత్రాలు సమర్పించారు. ఏప్రిల్ 25, 26వ తేదీల్లో ఉత్తరప్రదేశ్లోని మథురలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పం పించారు. దీనికితోడు మే 10న దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో జర్నలిస్టులకు రైల్వే పాస్లను జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రయత్నాలు ఫలించడంతో వివిధ రాష్ట్రాల్లో రైల్వేశాఖ అధికారులకు ఉన్నతాధికారుల నుంచి పాస్లు జారీ చేయాలని ఆదేశాలు వచ్చాయి.