సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు హేమలత
చిక్కడపల్లి, మే 26 : రైల్వే కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ హేమలత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త పోరాటాలు నిర్వహిస్తామన్నారు. గురువారం సా యంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నిర్వహించిన సీఐటీయూ రాష్ట్ర సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీసవేతనం, ఉద్యోగ భద్రత, చట్టబద్ధ్ద హక్కులను అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు ఎం.సాయిబాబా, బాసుదేవ్ ఆచార్య, రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జాతీయ కన్వీనర్ రమేశ్ బాబు, రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.వెంకటేశ్, బి.మధు, సీఐటీయూ జోన్ కార్యదర్శి రాములు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.