కాచిగూడ,ఆగస్టు 24: కలియుగ దైవం రాఘవేంద్ర స్వామి 350వ ఆరాధనోత్సవాలు బర్కత్పురలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠం, లింగంపల్లి శ్రీ రఘవేంద్ర బృందావన సమితిలో వైభవంగా జరిగాయి. మంగళవారం మధ్యారాధన, నిర్ణల్యా విసర్జన, అష్ర్టోరా పరయాన, ఉత్సవరాయ పాదపూజ, విశేష ఫల పంచామృత అభిశేకం,తులసీ అర్చన, అలంకార హస్తోదక మహా మంగళహరితి తీర్థ ప్రసాదం, దసరా పగడాలు, రథోత్సవ స్వస్థివాచన మహా మంగళహరితి కార్యక్రమాలతో పాటు వివిధ సంస్కృతిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించినట్లు బర్కత్పుర రఘవేంద్రస్వామి మఠం మేనేజర్ పురణిక్ తెలిపారు.
వేద పండితుల మధ్య రాఘవేంద్రస్వామికి పలు రకాల పూజ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో మంగళవారం నిర్వహించిన పూజలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.