కాచిగూడ,ఆగస్టు 23 : కలియుగ గురువు రాఘవేంద్ర స్వామి 350వ ఆరాధనోత్సవాలు బర్కత్పురలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠం, లింగంపల్లి రాఘవేంద్ర బృందావన సమితిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం విశిష్ట పూజలు కన్నుల పండువగా జరిగాయి. ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి అలంకార పూజ, నిర్మాలయ విసర్జన, సుప్రభాతం, అష్టోత్ర, పంచామృత, ఉత్సవరాయ పడిపూజ, విశేష ఫల పంచామృత అభిశేకం,తులసీ అర్చన, హస్తోదక ప్రసాదం, వివిధ సితార్, సంస్కృతిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.
వేద పండితుల మధ్య రాఘవేంద్రస్వామికి వివిధ పూజ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ ఆరాధనోత్సవాల్లో భాగంగా చివరి రోజు బర్కత్పుర ప్రాంతానికి చెందిన బ్లింకర్స్ వాలెంటర్స్ బహుకరించే శ్రీ రాఘవేంద్రస్వామి విగ్రహన్ని చిక్కడపల్లిలోని వెంకటేశ్వర దేవాలయం నుంచి బర్కత్పురలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠం వరకు ఉరేగింపుగా తీసుకు వస్తాం.
అనంతరం బర్కత్పుర పుర వీధుల్లో భక్తుల సౌకర్యార్థం కోసం ఉరేగింపు నిర్వహించనున్నట్లు బర్కత్పుర రాఘవేంద్రస్వామి మఠం మేనేజర్ పురణిక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బర్కత్పుర పుర రాఘవేంద్రస్వామి మఠం మేనేజర్ పురణిక్, రఘవేంద్ర బృందావన సమితి అధ్యక్షుడు ఎన్ఆర్ నాగప్పయ్య తెలిపారు.