కాచిగూడ, డిసెంబర్ 15 : కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో బీసీలకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
గురువారం ఢిల్లీలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హంసరాజ్ గంగారామ్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, లాల్కృష్ణ, నీల వెంకటేశ్, భూపేశ్సాగర్, వరప్రసాద్, జి.లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.