సన్నబియ్యంతో భోజనం
రాష్ట్రవ్యాప్తంగా 26 లక్షల మందికి ప్రయోజనం
నాణ్యమైన విద్యే.. ప్రభుత్వ ధ్యేయం
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బడంగ్పేట, ఏప్రిల్ 21: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అం దించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉదయం అల్పాహారం ఏర్పాటు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మంత్రి అల్పాహారం తీసుకున్నారు.
పలు విషయాలపై విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 7వ తరగతి వరకే మధ్యాహ్న భోజనం అందిస్తే తెలంగాణలో పదో తరగతి వరకు అందిస్తున్నామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో మేయర్లు దుర్గా దీప్లాల్ చౌహన్, చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్లు తీగల విక్రమ్ రెడ్డి, ఇబ్రాం శేఖర్, ఎంఈఓ కృష్ణయ్య, పాఠశాల హెడ్ మాస్టర్ సరళ, సత్య సాయి సేవా సమితి, నాయకులు పాల్గొన్నారు.